కర్నూలు బస్సు ప్రమాద కేసులో బైకర్ శివశంకర్ సెల్ఫోన్ కీలకంగా మారింది. శివశంకర్, తన స్నేహితుడు ఎర్రిస్వామితో కలిసి బైక్పై వెళ్తుండగా, చెట్లమల్లాపురం వద్ద డివైడర్ను ఢీకొని శంకర్ మృతి చెందాడు. గాయపడిన ఎర్రిస్వామి, శివశంకర్ మృతదేహాన్ని పక్కకు జరిపి అతని సెల్ఫోన్ తీసుకుని వెళ్లిపోయాడు. పోలీసులు దర్యాప్తులో సెల్ఫోన్ ఆధారంగా స్వామిని అదుపులోకి తీసుకున్నారు. అతను ప్రమాద కారణాలను వివరించాడు. పోలీసులు పెట్రోల్బంకులోని సీసీటీవీ సేకరించడంతో ప్రమాదానికి దారితీసిన అసలు గుట్టు విప్పింది.