లడఖ్‌ అల్లర్లు.. సోనమ్‌ వాంగ్‌చుక్‌ను జోధ్‌పూర్‌కు తరలింపు

లడఖ్‌లో జరిగిన అల్లర్ల వెనుక కుట్ర కోణంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ను పాకిస్తాన్‌తో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ, జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేసి, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు తరలించారు. అరబ్‌ విప్లవం, నేపాల్‌ జెన్‌-Z ఉద్యమాలను ప్రస్తావిస్తూ లడఖ్‌ యువతను రెచ్చగొట్టారని కేంద్రం ఆరోపిస్తోంది. వాంగ్‌చుక్‌పై పాకిస్తాన్‌ ఏజెంట్‌తో సంబంధాలున్నాయని, విదేశీ నిధులపై కూడా దర్యాప్తు జరుగుతోందని లడఖ్‌ డీజీపీ ఎస్డీ సింగ్‌ జమ్వాల్‌ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్