హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో విరిగిప‌డిన కొండ చ‌రియ‌లు (వీడియో)

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వ‌ర్షాలు కార‌ణంగా కొండ చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయి. పండో ఆన‌క‌ట్ట ద‌గ్గ‌ర కొండ చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో చండీగ‌ఢ్‌, మనాలీ జాతీయ ర‌హ‌దారిపై రాక‌పోక‌లు నిలిచిపోయాయి. కొండ చ‌రియ‌లు విరిగిప‌డుతున్న‌ స‌మ‌యంలో అటుగా వెళ్లిన ఓ కారు బోల్తా ప‌డింది. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్