రాజస్థాన్లోని జైపూర్లో మంత్రి సురేష్ సింగ్ రావత్ అధికారిక నివాసంలో గురువారం చిరుత రావడం కలకలం రేపింది. అత్యంత హై సెక్యూరిటీ జోన్లోని మంత్రి బంగ్లాలోకి చిరుత చొరబడటం సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు, అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని గాలించారు. ఆతరవాత సమీపంలోని స్కూల్ లోకి ప్రవేశించడంతో విద్యార్థులను క్లాస్ రూమ్ లలో లాక్ చేశారు. అనంతరం మరో ఇంట్లోకి వెళ్లినట్టు గుర్తించి పట్టుకున్నారు.