TG: హైదరాబాద్ బాలాపూర్లోని రీసర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) ప్రాంగణంలో రెండు చిరుతపులులు సంచరిస్తున్నట్లు గుర్తించి అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు డిఫెన్స్ విభాగం హెచ్చరిక జారీ చేస్తూ అక్కడి సిబ్బంది, స్థానికులను జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం చిరుతలను పట్టుకునేందుకు అటవీశాఖ చర్యలు ప్రారంభించింది.