ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి డిసెంబర్లో భారత్ను సందర్శించబోతున్నాడు. డిసెంబర్ 13 నుంచి 15 వరకు ముంబయి, కోల్కతా, ఢిల్లీ నగరాల్లో పర్యటించనున్నాడు. డిసెంబర్ 14న ముంబయి వాంఖడే స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్నాడు. కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ‘గోట్ కప్’ టోర్నీ, పిల్లల కోసం ఫుట్బాల్ వర్క్షాప్ నిర్వహించనున్నాడని ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.