ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్, పటేల్ నగర్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాఫిక్లో ఆగి ఉన్న వాహనాలను భారీ వేగంతో వచ్చిన ఒక ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో కారులో ఉన్న ముగ్గురు యువకులు ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. కారు మాత్రం నుజ్జు నుజ్జు అయింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రక్కు డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.