చండీగఢ్లోని సెక్టార్-11 ప్రాంతంలో శనివారం పట్టపగలే కాల్పుల కలకలం రేపింది. 'శ్రీ కుమార్ మెడికోస్' అనే మెడికల్ షాపులోకి ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు చొరబడి కెమిస్ట్పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని వెంటనే పీజీఐ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాల్పుల సమయంలో షాపులో ఉన్న కస్టమర్లు, సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.