పంజాబ్లోని భటిండా జిల్లాలో భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్థాన్ మిస్సైల్ను భారత భద్రతా దళాలు సమర్థవంతంగా కూల్చివేశాయి. అయితే దీనికి సంబంధించిన శకలాలు స్థానికులకు లభ్యమయ్యాయి. ఘటనా స్థలంలో స్థానికులు ఆ శకలాలను చూసి ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని శకలాలను పరిశీలించారు. ప్రజలను భయపడకుండా ఉండాలని సూచించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.