ఇటలీలోని బిటోంటోలో ఒక మహిళ పొరపాటున రూ. 11 కోట్ల విలువైన లాటరీ టికెట్ను చెత్తబుట్టలో పారేసింది. ఇంటికి వెళ్ళాక విషయం తెలిసి ఆందోళన చెందింది. పారిశుధ్య సిబ్బంది చెత్త ట్రక్ను వెతికి టికెట్ను సురక్షితంగా సేకరించారు. అయితే, వెతకడానికి అయిన ఖర్చులను ఆమెనే భరించాలని అధికారులు షరతు విధించారు. టికెట్ దొరకడంతో ఆమె ఆనందం వ్యక్తం చేసింది.