లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య మూడో టెస్టు నాలుగో రోజు ఆట కొనసాగుతోంది. ఓవర్నైట్ స్కోర్ 2/0తో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. భోజన విరామ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. తొలి సెషన్లోనే ఆతిథ్య జట్టు.. క్రాలీ(22), డకెట్(12), పోప్(4), బ్రూక్(23) వికెట్లు కోల్పోయింది. సిరాజ్ 2, నితీశ్, ఆకాశ్దీప్ తలో వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో జో రూట్(17), స్టోక్స్(2) పరుగులతో ఉన్నారు.