ఇళయరాజాను ప్రశ్నించిన మద్రాస్ హైకోర్టు

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అనుమతి లేకుండా తన పాటలను 'డ్యూడ్‌' సినిమాలో ఉపయోగించారని, కాపీరైట్ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 30 ఏళ్ల నాటి పాటలను ప్రస్తుత ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారని, దీనివల్ల ఇళయరాజా ఎలా ప్రభావితమవుతారని న్యాయమూర్తి ప్రశ్నించారు. పాటల హక్కులు తమ వద్ద ఉన్నాయని, వాటిని తొలగించాలని ఇళయరాజా న్యాయవాది కోరారు. 'డ్యూడ్‌' నిర్మాణ సంస్థ సోనీ సంస్థ నుంచి అనుమతి పొందినట్లు తెలిపింది. న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్