మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలంలోని సంకలమద్ది గ్రామ పరిధిలో 44వ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో 65 ఏళ్ల మహిళ అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన శ్రీకృష్ణ హోటల్ సమీపంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలిని గుర్తించిన వారు మూసాపేట పోలీసులను సంప్రదించాలని కోరారు.