దేవరకద్ర మండలం మీనుగొని పల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్ బోయ యాదయ్య, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ సమక్షంలో మంగళవారం కమ్యూనిస్టు పార్టీ నుంచి బీజేపీలో చేరారు. బీజేపీ అవలంబిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరానని, దేవరకద్ర మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని యాదయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఇంచార్జ్ డోకూరు పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.