మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలోని రైల్వే గోడౌన్ వద్ద శ్రీ మహాగణపతి ఆలయంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, కృష్ణారెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కృపతో నియోజకవర్గంలో అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.