ప్రైవేటు స్కూళ్లకు దీటుగా సర్కారు బడులు: దేవరకద్ర ఎమ్మెల్యే

వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డితో కలిసి మహబూబ్‌నగర్ జిల్లా, దేవరకద్ర నియోజకవర్గం, కొత్తకోట మండలం రాయినిపేటలో రూ. 24 లక్షల వ్యయంతో నిర్మించనున్న పాఠశాల తరగతి అదనపు గదులకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత అని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని, సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్యే ఏకైక మార్గమని తెలిపారు.

సంబంధిత పోస్ట్