మహబూబ్నగర్ జిల్లా, దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన బడ్జెట్ను 'చీటింగ్ బడ్జెట్' అనడం అర్థరహితమని అన్నారు. 1.15 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల జీవిత బీమా, ఆకలితో బడికి వెళ్లే పిల్లలకు ఉదయం అల్పాహారం అందించడం వంటి పథకాలు చీటింగ్ ఎలా అవుతాయో ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. సన్న వడ్లకు బోనస్, ఇతర అంశాలకు బడ్జెట్లో కేటాయింపులు చేశామన్నారు.