జోగులాంబ గద్వాల జిల్లాలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల మొదటి విడతలో భాగంగా, 11వ తేదీన జరగబోయే ఎన్నికలకు సంబంధించిన కేటి దొడ్డి గ్రామంలోని పోస్టల్ బ్యాలెట్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సోమవారం గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ సందర్శించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆయన సూచించారు.