గద్వాల్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో శాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. తేజేశ్వర్ మరణించినప్పుడు ఐశ్వర్య గ్లిజరిన్ వేసుకుని నకిలీగా ఏడ్చిందని తాజాగా బయటపడింది. ఆమె గదిలో బంధువులు గ్లిజరిన్ బాటిల్ కనుగొనడంతో ఈ విషయం తెలిసింది. తన లవర్ తిరుమలరావు లేడీ గొంతుతో వాయిస్ మెసెంజర్లో ఐశ్వర్యతో మాట్లాడినట్లు, తేజేశ్వర్ బెడ్రూంలో స్పై కెమెరా బిగించినట్లు విచారణలో తేలింది.