జోగులాంబ గద్వాల జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న చంద్రకళ, మునిస్వామి అనే నవజంటకు తమ కుటుంబ సభ్యుల నుండే ప్రాణహాని ఎదురవుతోంది. మేజర్లమంటూ ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్న తమను చంపేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని వారు పోలీసులను ఆశ్రయించారు. డిసెంబర్ 29, 2025న ఎర్రవల్లి మండలం బీచుపల్లి క్షేత్రంలో వీరి వివాహం జరిగింది. గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోగా, పోలీసులు తమను గంటల తరబడి స్టేషన్లో ఉంచి మానసిక వేదనకు గురిచేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.