జడ్చర్ల: బిఆర్ఎస్ కు భారీ షాక్... కాంగ్రెస్ లో చేరిన పిఏసిఎస్ చైర్మన్

మంగళవారం, జడ్చర్ల బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. బాదేపల్లి పిఏసిఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ, పాత, కొత్త తేడా లేకుండా అందరూ కలిసి అభివృద్ధికి పాటుపడాలని, అందరూ కలిసి నడిస్తేనే వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. వివిధ పార్టీల నుంచి ముందుకు వచ్చే ప్రతి నాయకుడు, యువకుడు, కార్యకర్త కాంగ్రెస్ పార్టీలో చేరి జడ్చర్ల అభివృద్ధి యజ్ఞంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్