నవాబుపేటలో భారీ వర్షం.. రైతుల ఆందోళన

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబు పేట మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం వల్ల పొలాల్లో పనిచేస్తున్న రైతులు, కూలీలు ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షం వరి పంటలకు మేలు చేసినప్పటికీ, చేతికి వచ్చిన పత్తి పంటకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్