మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబు పేట మండలం తీగలపల్లి గ్రామంలో సత్యనారాయణ వ్రతం అనంతరం పూజా సామగ్రిని చెరువులో పారేయడానికి వెళ్లిన రాంప్రసాద్ (26) అనే యువకుడు కాలుజారి నీటిలో పడి మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.