మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం నిర్వహించిన భారీ ర్యాలీపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల నుంచి అనుమతి తీసుకోకుండా, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ర్యాలీ చేపట్టినందుకు బుధవారం సీఐ కమలాకర్ చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.