జడ్చర్ల: ఈనెల 19 నుంచి పిల్లల మర్రి బాలోత్సవాలు

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆదివారం మాట్లాడుతూ, ఈ నెల 19 నుంచి పిల్లలమర్రి బాలికోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ ఉత్సవాలకు జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్ లో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇందులో సాంస్కృతిక, సాంప్రదాయక నృత్యాలతో పాటు విద్యార్థులకు పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్