మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ జీడిగుట్ట తండా వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన రెడ్యా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బాలానగర్కు బైక్పై వస్తున్న రెడ్యాను వెనుక నుంచి వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో రెడ్యాకు తీవ్ర గాయాలవడంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.