మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మల్లేబోయిన్ పల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటీవల భర్త మృతిచెందిన లక్ష్మి కుటుంబం, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చేందుకు దేవుని వద్దకు వెళ్లగా, ఇంట్లో దొంగలు చొరబడ్డారు. దాదాపు లక్ష రూపాయల నగదు, 8 తులాల బంగారం, కిలో వెండి వస్తువులను దొంగలు అపహరించుకెళ్లారు. ఇంటి పెద్ద మృతితో ఇప్పటికే దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి ఈ చోరీ తీరని నష్టాన్ని కలిగించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.