మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు గురువారం సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఒక లారీ డ్రైవర్, ఒక ద్విచక్ర వాహనదారుడిని ఎస్ఐ జయప్రసాద్, పోలీసు సిబ్బంది పట్టుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరించారు.