ఆదివారం, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల కేంద్రానికి చెందిన కమ్మరి సుధాకర్ అనే రైతు తన వ్యవసాయ పొలంలోని బోరు బావి నుంచి నీరు ఉబికి రావడం చూసి ఆనందానికి గురయ్యారు. గ్రామంలోని ఇతర రైతులు కూడా ఈ నీటి ప్రవాహాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తుఫాన్ వల్ల కురిసిన భారీ వర్షాల కారణంగా భూగర్భజలాలు పెరిగి, బోరు బావి నుంచి నీరు పైకి రావడానికి కారణమైందని భావిస్తున్నారు.