మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు ప్రభాకర్ శర్మ శనివారం చికిత్స పొందుతూ మృతి చెందారు. కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు నెల రోజుల క్రితం హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. అనంతరం కోలుకుని స్వగృహానికి చేరుకున్నా, ఇటీవల మళ్లీ అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేరారు.