జడ్చర్ల: నకిలీ కారం కలకలం.!

జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్ మండలంలోని ఉడిత్యాల గ్రామంలో కొత్త సంవత్సరం సందర్భంగా కొనుగోలు చేసిన కారంపొడి నకిలీదని తేలింది. గ్రామంలోని ఓ కిరాణా షాపులో కొన్న కారంపొడిని వంటకాల్లో వేయగా, రంగు తప్ప రుచి లేకపోవడంతో గ్రామస్థులు అనుమానించి పరిశీలించారు. షాపు యజమానిని అడగగా, ఆయన స్పందించలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన గురువారం జరిగింది.

సంబంధిత పోస్ట్