కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు ప్రనిల్ చందర్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శివశక్తి నగర్ కమిటీ హాల్లో శనివారం సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్కులో నిర్వహించబోయే బీసీ మహాధర్నాను విజయవంతం చేయాలన్నారు. జిల్లా నుంచి వేలాదిగా బీసీలు తరలిరావాలన్నారు.