మహబూబ్ నగర్: బస్సు ఢీకొని బాలుడికి తీవ్ర గాయాలు

మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం చిన్నదర్పల్లిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామకృష్ణ (6) అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్కూల్కు వెళ్తూ రోడ్డు దాటుతున్న బాలుడిని మహబూబ్నగర్ నుంచి తాండూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడికి రెండు కాళ్లు విరిగిపోయాయి. గాయపడిన రామకృష్ణను 108 అంబులెన్స్ సిబ్బంది జిల్లా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్