చౌటుప్పల్ మండలం తూప్రాన్పేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికా వసతి గృహంలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని హాస్టల్ పై నుంచి దూకి మృతి చెందింది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. మృతురాలిని మహబూబ్నగర్ జిల్లా చెందిన సంధ్యగా గుర్తించారు. ఇటీవలే ఇంటికి వెళ్లిన ఆమెను నిన్న తిరిగి హాస్టల్లో చేర్పించినట్లు సమాచారం.