అచ్చంపేట: వైద్యం వికటించి బాలింత మృతి.. బంధువుల ఆందోళన

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలింత మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం. ఉప్పునుంతల మండలం అయ్యవారిపల్లికి చెందిన శ్రావణి ప్రసవం కోసం నిన్న ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. సిజేరియన్ తర్వాత అధిక రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. దీంతో అచ్చంపేట ఆసుపత్రి ముందు బాధిత కుటుంబీకులు ఆందోళనకు దిగారు.

సంబంధిత పోస్ట్