నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లిలోని ఒక పౌల్ట్రీ ఫామ్లో వింత వ్యాధితో 4,500 బాయిలర్ కోళ్లు మృతి చెందడం కలకలం రేపింది. జిల్లా పశు వైద్యాధికారి డా. జ్ఞానశేఖర్ ఫామ్ను సందర్శించి, కోళ్ల నమూనాలను పరీక్షల కోసం మహబూబ్ నగర్కు పంపారు. నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు.