మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నదగడ, అమ్మాయిపల్లి గ్రామాల్లో పర్యటించారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికపై స్థానిక అధికారులు, ప్రజలతో సమావేశమయ్యారు. సంక్షేమ పథకాల అమలు పారదర్శకంగా ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ప్రయోజనాలు చేరేలా కృషి చేయాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.