నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలోని లక్కారంలో భర్త మన్నెం శ్రీను చేతిలో భార్య బంగారమ్మ (46) హత్యకు గురైన సంఘటనలో నిందితుడైన భర్తను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 26 ఏళ్ల వివాహ బంధంలో ఉన్న ఈ దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని, తాగిన మైకంలో అర్ధరాత్రి శ్రీను తన భార్యను రాడ్ తో కొట్టి చంపినట్లు విచారణలో తేలిందని DSP శ్రీనివాస్ తెలిపారు.