గత పాలకులు పాలమూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని, అయితే ఉమ్మడి పాలమూరు ప్రజలు ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలిపించి విశ్వాసం చూపడంతో, ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సోమవారం మక్తల్ ప్రజాపాలన విజయోత్సవ సభలో తెలిపారు. పెండింగ్లో ఉన్న మక్తల్-నారాయణపేట-కొడంగల్ నీటిపారుదల ప్రాజెక్టులతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.