వనపర్తి జిల్లా ఆత్మకూరులో మంగళవారం జరగనున్న పెద్దమ్మ తల్లి మహోత్సవం కోసం, ఐదో వార్డ్ కౌన్సిలర్ దండు శ్రీను ఆధ్వర్యంలో అంబేడ్కర్ నగర్, గాంధీనగర్, భార్గవి నగర్, సంసార్ కాలనీ ప్రజల నుండి రూ.1,90,000 విరాళాలు సేకరించి ఆలయ కమిటీ ఛైర్మన్ డాక్టర్ మొగిలి శ్రీధర్ గౌడికి సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాపారాయుడు, బాల వెంకటన్న, బాల మణ్యం, మనీ వర్ధన్ రెడ్డి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.