వనపర్తి: విద్యారంగంలో బలోపేతానికి ప్రాధాన్యత: మంత్రి శ్రీహరి

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ కల్పిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీహరి, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డిలతో కలిసి రూ. 1. 20 కోట్ల ఎంపీ నిధులతో నిర్మించిన ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. అలాగే, రూ. 80 లక్షలతో మర్రికుంట, కేజీవిబీ పాఠశాల లో మౌళిక వసతుల కల్పన పనులకు శంకుస్థాపన చేశారు.

సంబంధిత పోస్ట్