మహాశివరాత్రి.. స్నానానికి దిగి ఇద్దరు అన్నదమ్ములు మృతి

AP: ఏలూరు జిల్లాలోని లింగపాలెం (M) విషాద ఘటన చోటుచేసుకుంది. శివరాత్రి పండుగ వేళ తమ్మిలేరులో స్నానానికి దిగి ఇద్దరు అన్నదమ్ముల ప్రమాదవశాత్తు నీటిల్ మునిగి చనిపోయారు. తిమ్మపాలెం గ్రామానికి చెందిన మునియ్య(25), మురళీ(22) గా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. రెస్క్యూ చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్