పశ్చిమబెంగాల్లోని హల్దియా రిఫైనరీలో మంగళవారం తెల్లవారుజామున భారీ ప్రమాదం చోటుచేసుకుంది. 4-5 గంటల మధ్య నాఫ్తా సరఫరా చేసే పైపులైన్లో భారీ మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది.