బాలుర అనాథాశ్రమంలో భారీ అగ్నిప్రమాదం

కృష్ణా జిల్లా గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. ప్రమాద సమయంలో ఆశ్రమంలో 140 మంది విద్యార్థులు ఉండగా ఆరుగురు మంటల్లో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేసి విద్యార్థులను రక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్