మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ట్రాన్స్ జెండర్గా మారడానికి విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో తన ఆరేళ్ల వివాహ జీవితానికి స్వస్తి పలికాడు. కాగా వీరికి మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. తాను స్వలింగ సంపర్కుడినని తన లింగాన్ని మార్చుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఏడాది నుంచి కుటుంబ సభ్యులు సర్ధిచెప్పినా తాను మాత్రం దానికి అంగీకరించలేదు. చివరకు కోర్టును ఆశ్రయించి విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు.