అమ్మ ఒడి ఎన్జీవో ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాతల సహకారంతో ఆదివారం నిరుపేదలు, యాచకులు, బాటసారులు, చిరు వ్యాపారులకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఒడి ఎన్జీవో బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్ హనుమాండ్ల మధుకర్, కార్యవర్గ సభ్యులు, దాత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.