బెల్లంపల్లి మండలంలోని పెరకవల్లి, బట్ వాన్ పల్లి, ఆకెనపల్లి గ్రామాల్లో గురువారం అకాల వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను వ్యవసాయ అధికారులు సందర్శించారు. కోతకు వచ్చిన దశలో పంటలు నేలకొరిగాయని రైతులు అధికారులకు తెలిపారు. నష్ట శాతాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ఏవో ప్రేమ్ కుమార్ రైతులకు హామీ ఇచ్చారు.