కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇఫ్ట్యూ ఆధ్వర్యంలో బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి సివిల్ కార్యాలయంలో కార్మికులు ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ లేబర్ కోడులతో సమ్మె హక్కు పూర్తిగా లేకుండా పోతుందని, 8 గంటల పని విధానాన్ని పెంచుతూ చట్టాలను రూపొందించారని సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.