శుక్రవారం రాత్రి బెల్లంపల్లి మండలం సోమగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వస్తున్న కారు వెనుక నుంచి బైకును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.