రైతులు పండించిన పత్తి పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని, తేమ పేరుతో ధరలో కోత పెట్టరాదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి డిమాండ్ చేశారు. తాండూరులోని జిన్నింగ్ మిల్లులను బిజెపి నాయకులతో కలిసి పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట నష్టపోయిన రైతుల ఆవేదనను ఆయన వ్యక్తం చేశారు.